గంజాయి కేసులో కేరళ ఎమ్మెల్యే కొడుకు అరెస్ట్..!
- తొమ్మిది మందిని అరెస్టు చేశామన్న ఎక్సైజ్ అధికారులు
- తప్పుడు వార్తలంటూ కొట్టిపారేసిన ఎమ్మెల్యే ప్రతిభ
- అధికారులు తన కొడుకును కేవలం ప్రశ్నించారని వివరణ
తన కొడుకు అతడి స్నేహితులతో కలిసి కూర్చున్న సమయంలో ఎక్సైజ్ అధికారులు అక్కడికి వచ్చారని, అందరితో పాటు తన కొడుకును కూడా ప్రశ్నించారని చెప్పారు. తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దని కోరారు. ఈ వార్తలు చూసి తనకు చాలామంది ఫోన్ చేస్తున్నారని, నిరాధార కథనాలను ఇప్పటికైనా ఆపేయాలని కోరారు. తన కొడుకు అరెస్టు వార్తలు నిజమే అయితే తాను బహిరంగ క్షమాపణ చెబుతానని, తప్పుడు వార్తలైతే మీడియా కూడా క్షమాపణ చెప్పాలని అన్నారు. కాగా, అరెస్టు వార్తలపై ఎమ్మెల్యే ప్రతిభ కొడుకు కూడా సోషల్ మీడియాలో స్పందించాడు. గంజాయి కేసులో తనను అరెస్టు చేశారంటూ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజంలేదని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశాడు.