పాక్ క్రికెట్ బోర్డుకు అఫ్రిది మద్దతు... బీసీసీఐపై ఆగ్రహం
- ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలన్న ప్రతిపాదనకు పీసీబీ నిరాకరణ
- మొత్తం టోర్నీని పాక్ గడ్డపైనే నిర్వహించాని పట్టు
- నేటి సమావేశం తర్వాత ఓ నిర్ణయం తీసుకోనున్న ఐసీసీ
- క్రీడలు, రాజకీయాలను ఒక గాటన కట్టడమేంటని బీసీసీఐపై అఫ్రిది ఫైర్
మరోవైపు, ట్రోఫీకి భారత జట్టును పాకిస్థాన్కు పంపే ప్రశ్నే లేదని బీసీసీఐ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. హైబ్రిడ్ మోడల్కు నిరాకరిస్తున్న పీసీబీ టోర్నీ మొత్తాన్ని పాక్ గడ్డపైనే నిర్వహించాలని పట్టుబడుతోంది.
ముంబై ఉగ్రదాడుల తర్వాత పాక్ జట్టు భారత్లో ఐదుసార్లు పర్యటించిన విషయాన్ని అఫ్రిది ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక వైట్ బాల్ సిరీస్ జరిగినట్టు కూడా చెప్పాడు. కాబట్టి ఇప్పుడు సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ఐసీసీ, దాని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లపైనే ఆధారపడి ఉందని పేర్కొన్నాడు.