రోడ్డు ప్రమాదంలో ఐదుగురు డాక్టర్లు సహా ఆరుగురి దుర్మరణం
- ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ జిల్లాలో ఘటన
- అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్న కారు
- వైద్యులందరూ సైఫాయి మెడికల్ కాలేజీకి చెందిన వారే
వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి అవతలి రోడ్డులోకి దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న ట్రక్ను ఢీకొట్టినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జయ్వీర్ సింగ్ సైఫాయి మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నట్టు పోలీసులు తెలిపారు. మృతుల కుటుంబాలకు పోలీసులు సమాచారం అందించారు.