ఢిల్లీ క్యాపిటల్స్కు శ్రీకాకుళం కుర్రాడు.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు విషెస్
- శ్రీకాకుళం జిల్లాకు చెందిన త్రిపురాన విజయ్ను కొన్న ఢిల్లీ క్యాపిటల్స్
- బేస్ ప్రైజ్ రూ. 30లక్షలకే విజయ్ను దక్కించుకున్న ఫ్రాంచైజీ
- విజయ్కు శుభాకాంక్షలు తెలుపుతూ కేంద్రమంత్రి ట్వీట్
"శ్రీకాకుళం జిల్లా నుండి ఐపీఎల్కు ఎంపికయిన త్రిపురాన విజయ్కు హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ప్రయాణం చాలా మందికి స్ఫూర్తిదాయకం. ఈ కొత్త అధ్యాయంలో మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాను. శ్రీకాకుళం గర్వపడేలా కష్టపడండి" అని రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు.