భారత జలాంతర్గామిని ఢీకొట్టిన చేపల వేట నౌక
- గోవా తీరానికి 70 నాటికల్ మైళ్ల దూరంలో ప్రమాదం
- చేపల వేట నౌకలో ఉన్న 13 మందిలో 11 మందిని రక్షించిన సిబ్బంది
- ఇద్దరి కోసం భారీ రెస్క్యూ ఆపరేషన్
ఇండియన్ నేవీ ఆరు నౌకలు, రెండు ఎయిర్ క్రాఫ్ట్స్తో భారీ రెస్క్యూ ఆపరేషన్ను ప్రారంభించింది. ఈ ప్రాంతం మొత్తాన్ని కోస్ట్ గార్డ్ తమ ఆధీనంలోకి తీసుకొని... నౌకల మార్గాలను మళ్లించింది. జలాంతర్గామికి ఏ మేరకు నష్టం జరిగిందో తెలియాల్సి ఉంది.