ఇజ్రాయెల్ లక్ష్యంగా 165 రాకెట్లు ప్రయోగించిన హిజ్బుల్లా
- ఉత్తర ఇజ్రాయెల్లోని హైఫా పట్టణం లక్ష్యంగా దాడి
- లెబనాన్ నుంచి రాకెట్లు ప్రయోగించిన హిజ్బుల్లా
- ఏడుగురు ఇజ్రాయెల్ పౌరులకు గాయాలు
లెబనాన్లో సెప్టెంబర్లో జరిగిన పేజర్, వాకీ-టాకీ దాడుల్లో తమ దేశ ప్రమేయం ఉందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అంగీకరించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ దాడి జరగడం గమనార్హం. కాగా హిజ్బుల్లా కమాండర్లే లక్ష్యంగా జరిగిన పేజర్, వాకీ-టాకీ పేలుళ్ల ఘటనలో కనీసం 39 మంది చనిపోయారు. 3,000 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. మరోవైపు హిజ్బుల్లాతో యుద్ధాన్ని ముగించే ప్రయత్నాలలో ‘నిర్దిష్ట పురోగతి’ ఉందని ఇజ్రాయెల్ నూతన విదేశాంగ మంత్రి సోమవారం అన్నారు. అయితే తమకు ఎలాంటి అధికారిక ప్రతిపాదన రాలేదని హిజ్బుల్లా ప్రతినిధి ఒకరు చెప్పారు. అవసరమైతే సుదీర్ఘ యుద్ధానికి సిద్ధమని పేర్కొనడం గమనార్హం.