బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు భారీ ఊరట... కాంగ్రెస్ నేత పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
- 2023లో ఆసిఫాబాద్ నుంచి గెలిచిన కోవా లక్ష్మి
- కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన అజ్మీరా శ్యాం
- అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ అజ్మీరా శ్యాం పిటిషన్
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కోవా లక్ష్మీ ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి సమీప కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా శ్యాంపై 22 వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. అయితే ఎన్నికల అఫిడవిట్లో ఆమె తప్పుడు సమాచారం ఇచ్చారని, ఆమె ఎన్నిక చెల్లదంటూ అజ్మీరా శ్యాం కోర్టుకు వెళ్లారు.