Anushka Sharma: ముంబైలో కృష్ణదాస్ కీర్తనలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ

Anushka Sharma Virat Kohli attend Krishna Das kirtan in Mumbai
  • ముంబైలోని నెస్కోలో ఆధ్యాత్మిక కార్యక్రమంలో కోహ్లీ దంపతులు
  • కోహ్లీ, అనుష్క శర్మ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన నిర్వాహకులు
  • కృష్ణదాస్ కీర్తనకు గతంలోనూ హాజరైన కోహ్లీ దంపతులు
ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ దంపతులు ముంబైలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్టోబర్ 20న నెస్కోలో అమెరికన్ గాయకుడు కృష్ణదాస్ కీర్తన కార్యక్రమానికి కోహ్లీ, అనుష్క శర్మ హాజరయ్యారు. ఈవెంట్ నిర్వాహకులు ఈ జంట ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వారు నవ్వుతూ కీర్తనను ఆస్వాదిస్తున్న ఫొటోలను షేర్ చేశారు. ఓ ఫొటోలో కోహ్లీ నవ్వుతూ కీర్తనను ఆస్వాదిస్తుండగా... అనుష్క శర్మ చప్పట్లు కొడుతూ కనిపించారు.

ఈరోజు ముంబైలోని కృష్ణదాస్ లైవ్ కార్యక్రమంలో కోహ్లీ, అనుష్క శర్మ పాల్గొన్నారు... వారు ప్రశాంతమైన వాతావరణంలో పాల్గొన్నారని పేర్కొన్నారు. అక్కడ వారి హాజరు ప్రత్యేకంగా నిలిచిందన్నారు. కృష్ణదాస్ కీర్తనకు ఈ జంట గతంలోనూ హాజరైంది. ఈ ఏడాది జులైలో లండన్‌లో కృష్ణదాస్ కీర్తనలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అనుష్క శర్మ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
Anushka Sharma
Virat Kohli
Mumbai

More Telugu News