సాక్షి పత్రికకు నిధులు ఇవ్వడంపై విచారణ జరుపుతున్నాం: ఏపీ మంత్రి పార్థసారథి
- ఒకే రోజు 60 లక్షలకు పైగా పింఛన్లను పంపిణీ చేయించిన ఘనత చంద్రబాబుదన్న పార్థసారథి
- మేనిఫెస్టో పేరుతో గత ప్రభుత్వం ప్రజా ధనాన్ని దోపిడీ చేసిందని విమర్శ
- కూటమి పాలనలో రాష్ట్రానికి పెట్టుబడిదారులు క్యూ కడుతున్నారని వ్యాఖ్య
మేనిఫెస్టో పేరుతో గత ప్రభుత్వం దోపిడీ చేసిందని... ఐదేళ్ల పాలనలో రూ. 10.50 లక్షల కోట్ల అప్పు చేసిందని పార్థసారథి తెలిపారు. అవినీతిని వ్యవస్థీకృతం చేశారని దుయ్యబట్టారు. లబ్ధిదారులకు ఇచ్చే గృహ నిర్మాణ వ్యయాన్ని రూ. 2.50 లక్షల నుంచి రూ. 1.80 లక్షలకు తగ్గించింది కూడా గత ప్రభుత్వమేనని విమర్శించారు.
సాక్షి పత్రికకు గత ప్రభుత్వం నిధులు ఇవ్వడంపైనా... ప్రభుత్వ ప్రకటనలను సాక్షికి మాత్రమే ఇవ్వడంపైనా విచారణ జరుపుతున్నామని మంత్రి చెప్పారు. రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొచ్చి లక్షల మందికి ఉపాధిని కల్పించే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. పెట్టుబడిదారులు ఏపీకి క్యూ కడుతున్నారని చెప్పారు.