ఇది సనాతన ధర్మంపై జరిగిన దాడి: రామజన్మ భూమి ప్రధాన అర్చకుడు సత్యేంద్ర దాస్
- తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన రామజన్మ భూమి ప్రధాన అర్చకుడు
- ఇది కచ్చితంగా కుట్రేనన్న ఆచార్య సత్యేంద్ర దాస్
- ఈ విషయాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలని సూచన
- దోషులను కఠినంగా శిక్షించాలని వ్యాఖ్య
ఆచార్య సత్యేంద్ర దాస్ మాట్లాడుతూ... "పవిత్రమైన దైవ ప్రసాదంలో చేపనూనె కలిపినట్లు తనిఖీల్లో స్పష్టమైంది. ఇదంతా ఎప్పుడు జరిగిందో ఇప్పటికీ తెలియట్లేదు. ఇది కచ్చితంగా కుట్ర. సనాతన ధర్మంపై జరిగిన దాడి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ దాడిని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలి. సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి" అని ఆయన అన్నారు.