చిక్కకుండా తిరుగుతున్న రాకాసి తోడేలును పట్టుకునేందుకు అధికారుల ఎత్తుగడ
- ఉత్తరప్రదేశ్ లోని మహసి ప్రాంతంలో కొనసాగుతున్న ఆపరేషన్ భేడియా
- తోడేలుల మందలో ఐదింటిని బంధించిన అటవీ శాఖ అధికారులు
- ఆడ తోడేలు గొంతు అస్త్రంగా వినూత్న ప్రయోగం చేస్తున్న అధికారులు
అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనుకు చిక్కకుండా తిరుగుతున్న దాన్ని మగ తోడేలుగా భావించిన అధికారులు.. దాన్ని పట్టుకునేందుకు ఆడ తోడేలు గొంతు అస్త్రంగా సరికొత్త ప్రయోగాన్ని చేస్తున్నారు. ఆడ తోడేలు ఊళ (గొంతు) రికార్డును వివిధ ప్రాంతాల్లో వినిపిస్తున్నారు. ఒకవేళ ఆ మగ తోడేలు ఆ ప్రాంతంలో సంచరిస్తున్నట్లయితే .. ఆ ఊళ వినిపిస్తుందని, బంధించడం ఈజీ అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఆడ తోడేలు గొంతుతో పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామని డివిజన్ ఫారెస్టు అధికారి అజిత్ ప్రతాప్ సింగ్ మీడియాకు తెలిపారు.