కూటమి ఎమ్మెల్యేలకు చంద్రబాబు పిలుపు
- మంగళగిరిలో నేడు 4 గంటలకు మీటింగ్
- వంద రోజుల పాలనపై ఎమ్మెల్యేలకు ప్రోగ్రెస్ కార్డులు
- భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్న ముఖ్యమంత్రి
ప్రోగ్రెస్ కార్డులు సిద్ధమైతే ఎమ్మెల్యేలకు విడివిడిగా ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఒకవేళ ప్రోగ్రెస్ కార్డులు సిద్ధం కాకుంటే తర్వాత ఇవ్వనున్నారు. మీటింగ్ లో భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చిస్తారని, మీటింగ్ మూడు గంటలకు పైగా జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. మిత్రపక్షాలకు సీట్లు ఇచ్చిన నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్చార్జులు, ఓడిపోయిన టీడీపీ అభ్యర్థులతో కూడా విడిగా సమావేశం నిర్వహించాలని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయించింది. కాగా, బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఉదయం 11 గంటలకు సచివాలయంలో మంత్రులతో ఆయన సమావేశం కానున్నారు.