మా అమ్మ చిరకాల స్వప్నం ఇదే... నెరవేరింది: జూనియర్ ఎన్టీఆర్
- సొంతూరుకి తీసుకువెళ్లి ఉడుపి శ్రీకృష్ణుడ్ని దర్శనం చేయించాలనేది అమ్మ చిరకాల స్వప్నమన్న తారక్
- తల్లి కోరిక నెరవేర్చినఎన్టీఆర్
- తారక్ తో పాటు ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి
ఈ కల నెరవేరేందుకు తనతో పాటు ఉన్న దర్శకుడు ప్రశాంత్ నీల్, సినీ నిర్మాత, హొంబలే గ్రూప్ వ్యవస్థాపకుడు విజయ్ కిరగండూర్ కి ధన్యవాదాలు తెలుపుతున్నానని తారక్ చెప్పారు. తన ఆప్త మిత్రుడు రిషబ్ శెట్టి (కాంతార ఫేమ్) తమతో ఉండటం ఈ సంతోష సమయాన్ని మరింత ప్రత్యేకంగా మార్చిందని అన్నారు. తన తల్లి, రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ లతో కలిసి దిగిన ఫొటోలను ఎక్స్ వేదికగా షేర్ చేశారు.


