కోల్కతా హత్యాచార ఘటన.. కోర్టులో నిందితుడి ట్విస్ట్.. ఏ తప్పు చేయలేదంటూ భావోద్వేగం!
- యావత్ దేశాన్ని కలచివేసిన ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన
- తాజాగా నిందితుడు సంజయ్ రాయ్ను కోర్టులో హాజరుపర్చిన సీబీఐ
- విచారణలో భాగంగా కోర్టులో సంజయ్ సంచలన ఆరోపణలు
అయితే, విచారణలో భాగంగా కోర్టులో సంజయ్ సంచలన ఆరోపణలు చేసినట్లు సమాచారం. ఈ మేరకు పలు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ కేసులో నిందితుడు పాలిగ్రాఫ్ పరీక్షకు అంగీకరించడంతో న్యాయస్థానం అధికారులకు అనుమతి ఇచ్చింది.
ఈ సందర్భంగా పాలిగ్రాఫ్ టెస్టుకు ఎందుకు అంగీకరించావ్? అని మేజిస్ట్రేట్ సంజయ్ రాయ్ను ప్రశ్నించారు. దాంతో అతడు భావోద్వేగానికి గురయ్యాడట. "నేను అమాయకుడిని. ఏ తప్పు చేయలేదు. నన్ను ఇందులో కావాలని ఇరికించారు. ఈ పరీక్షలో అసలు విషయం బయటపడుతుంది" అని నిందితుడు చెప్పినట్లు తెలుస్తోంది.