టీడీపీలో చేరిన 16 మంది కౌన్సిలర్లు... 'సైకిల్' ఖాతాలో మాచర్ల మున్సిపాలిటీ
- మాచర్ల మున్సిపాలిటీ పరిధిలో 31 వార్డులు
- కూటమి ప్రభుత్వం వచ్చాక ఆసక్తికర పరిణామాలు
- ఇంతకుముందే టీడీపీలో చేరిన 14 మంది కౌన్సిలర్లు
ఈ క్రమంలో పోలూరు నరసింహారావు చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేశారు. పోలూరు నరసింహారావు ఇప్పటికే మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. మాచర్ల మున్సిపాలిటీ పరిధిలో 31 వార్డులు ఉండగా... ఇటీవలే 14 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. తాజాగా 16 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరడంతో టీడీపీకి ఎదురులేకుండా పోయింది.