ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు... ఏపీ సీఎం చంద్రబాబు ఏమన్నారంటే...!
- ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ సబబేనన్న సుప్రీంకోర్టు
- గతంలోనే తాను ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా వర్గీకరణ చేశానన్న చంద్రబాబు
- ఇవాళ సుప్రీంకోర్టు కూడా రిజర్వేషన్ల వర్గీకరణను ధ్రువీకరించిందని హర్షం
గతంలోనే వర్గీకరణ చేస్తూ ఏ, బీ, సీ, డీ కేటగిరీలు తీసుకువచ్చానని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, జనాభా దామాషా ప్రకారం అందరికీ న్యాయం జరగాలని తాము మొదటి నుంచి చెబుతున్నామని, పార్టీ సిద్ధాంతం కూడా అదేనని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణను తాను ఆనాడే ప్రతిపాదించానని వెల్లడించారు. అందుకే 1996-97లో రామచంద్రరావు కమిషన్ వేసి, ఆర్థిక పరిస్థితులన్నీ అధ్యయనం చేసిన తర్వాత... ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా తానే విభజించానని చంద్రబాబు తెలిపారు.
ఆ తర్వాత కాలంలో వర్గీకరణ అంశం అనేక కోర్టులలో విచారణకు వచ్చిందని, చివరికి సుప్రీంకోర్టులో నేడు ఏడుగురు జడ్జిల ధర్మాసనం వర్గీకరణ సబబేని ధ్రువీకరించిందని చంద్రబాబు వివరించారు. ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులోనూ సామాజిక న్యాయం చేశామని చెప్పారు.