నీట్ సవరించిన ఫలితాలపై అయోమయం... స్పష్టత నిచ్చిన విద్యాశాఖ
- నేడు నీట్ ఫలితాలు విడుదలైనట్టు వార్తలు
- ఎన్టీయే వెబ్ సైట్ లో ఓపెన్ కాని లింకు
- వెబ్ సైట్లో ఉన్నది పాత లింకు అని విద్యాశాఖ వెల్లడి
- త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని స్పష్టీకరణ
దాంతో కేంద్ర విద్యాశాఖ వివరణ ఇచ్చింది. ఎన్టీయే వెబ్ సైట్లో ఉన్నది పాత లింకు అని, ఆ లింక్ చూసి స్కోర్ కార్డ్ లు ప్రకటించినట్టుగా భావించారని పేర్కొంది. సవరించిన స్కోర్ కార్డులు ఇంకా విడుదల చేయలేదని స్పష్టం చేసింది. త్వరలోనే ఫలితాలపై అధికారిక ప్రకటన ఉంటుందని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.