భారీగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడులకు ఇదే సరైన సమయం!
- బడ్జెట్లో కస్టమ్స్ సుంకాల్లో భారీ కోత, జీఎస్టీ యథాతథం
- ఫలితంగా భారీగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు
- పెట్టుబడులకు ఇదే సరైన సమయం అంటున్న నిపుణులు
- సావరిన్ గోల్డ్ బాండ్స్ మరింత లాభదాయకమని అభిప్రాయం
- భవిష్యత్తులో ధరలు మళ్లీ పెరుగుతాయని స్పష్టీకరణ
భవిష్యత్తులో పెరగచ్చు!
బంగారం ధరలు తగ్గడంపై రిటైల్ వినియోగదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని నిపుణులు కూడా చెబుతున్నారు. బంగారం, వెండి ధరలు ప్రస్తుతం తగ్గినా భవిష్యత్తులో పెరిగి స్థిరీకరణ చెందుతాయని చెబుతున్నారు. డాలర్-రూపాయి మారకం విలువ, అమెరికా వడ్డీ రేట్ల పెంపు, భౌగోళికరాజకీయ పరిణామాలు, చైనా ప్రభుత్వ నిర్ణయాలు వెరసి బంగారం ధరలు మళ్లీ పెరుగుతాయని చెబుతున్నారు. కాబట్టి, ఇన్వెస్టర్లు ఈ సమయాన్ని పెట్టుబడులకు వినియోగించుకుంటే భవిష్యత్తులో బంగారం ధరలు పెరిగాక మంచి లాభాలు కళ్లచూడొచ్చని అంటున్నారు. డిజిటల్ పెట్టుబడి సాధనమైన సావరిన్ గోల్డ్ బాండ్స్ మరింత తక్కువ ధరకు అందుబాటులో ఉంటాయని, ఏడాదికి 2.5 శాతం వడ్డీ ఇస్తాయని చెబుతున్నారు. ఫలితంగా ఇవి మరింత లాభదాయకంగా ఉంటాయని తెలిపారు.