రేవంత్ రెడ్డికి మెమొంటో ఇచ్చిన వైఎస్ షర్మిల
- వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ఇచ్చిన షర్మిల
- మంగళగిరిలో వైఎస్ 75వ జయంతి వేడుకలు
- పాల్గొన్న ఏపీ, తెలంగాణ కాంగ్రెస్ నేతలు
ఈ సభకు ఏపీకి చెందిన పార్టీ నాయకులతో పాటు కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, పలువురు తెలంగాణ మంత్రులు హాజరయ్యారు. కార్యక్రమం ముగియడానికి ముందు షర్మిల, కేవీపీ రామచంద్రరావు కలిసి తెలంగాణ సీఎంకు శ్రీవెంకటేశ్వరస్వామి వారి విగ్రహాన్ని బహూకరించారు.