Motilal Naik: స్పందించని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. దీక్ష విరమించిన మోతీలాల్

OU student JAC leader Motilal Naik ends his hunger srike
  • నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మోతీలాల్ దీక్ష
  • 9 రోజులు అయినా స్పందించని ప్రభుత్వం
  • ఆరోగ్యం విషమిస్తుండడంతో దీక్ష విరమణ
  • ప్రత్యక్ష పోరాటాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరిక
నిరుద్యోగుల సమస్య పరిష్కారం కోసం నిరాహార దీక్ష చేపట్టిన ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేత మోతీలాల్ నాయక్ దీక్ష విరమించారు. గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు పెంచడంతోపాటు గ్రూప్1లో 1:100 రేషియోలో భర్తీ చేయాలన్నది మోతీలాల్ డిమాండ్.

తొమ్మిది రోజులుగా గాంధీ ఆసుపత్రిలో దీక్ష చేస్తున్నప్పటికీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, ఆరోగ్యం క్షీణించడం, కిడ్నీలు, కాలేయం దెబ్బతినే అవకాశం ఉండడంతో దీక్ష విరమించినట్టు మోతీలాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించినా నిరుద్యోగుల సమస్య మాత్రం పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాడతామని, రేపటి నుంచి పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని తెలిపారు.
Motilal Naik
OU Student JAC
Telangana
Revanth Reddy

More Telugu News