చంద్రబాబు పాలన @ సచివాలయం.. టైమింగ్స్ ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు!
- సెక్రటేరియెట్ వేదికగా పాలన కొనసాగించనున్న చంద్రబాబు
- నిరంతరం అందుబాటులో ఉండేందుకు నిర్ణయం
- మంత్రులు ప్రతి రోజూ సచివాలయానికి రావాలని దిశానిర్దేశం
మంత్రులకు దిశానిర్దేశనం
సెక్రటేరియెట్ నుంచి పాలన అందించాలని నిర్ణయించన సీఎం చంద్రబాబు కేబినెట్ మంత్రులకు కూడా కీలక దిశానిర్దేశం చేశారు. మంత్రులు ప్రతి రోజూ సచివాలయానికి రావాలని, అదేవిధంగా సమయపాలన కచ్చితంగా పాటించాలని సీఎం సూచించినట్టు తెలుస్తోంది. తమ శాఖలపై పట్టు పెంచుకోవాలని, పరిపాలన పరంగా సంపూర్ణ అవగాహన పొందాలని సూచించారు. సచివాలయంలో తనను కలిసేందుకు వచ్చిన మంత్రులకు ఆయన ఈ మేరకు దిశానిర్దేశం చేశారని సమాచారం.