రెచ్చిపోతున్న ఉగ్రవాదులు.. కశ్మీర్లో ఎన్కౌంటర్
- బుధవారం రాత్రి దోడా జిల్లాలోని గాంఢో ప్రాంతంలో ఎన్కౌంటర్
- పోలీసుల గాలింపు చర్యల సందర్భంగా కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాదులు
- ప్రతిదాడికి దిగిన భద్రతా దళాలు
అంతకుమునుపు, స్థానికంగా ఉన్న ఓ చెక్ పోస్టుపై ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు గాయపడ్డారు. ఆ తరువాత సుమారు ఆరు గంటలకు ఉగ్రవాదులకు, పోలీసులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఉగ్రదాడి నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా హైవేపై వాహనరాకపోకలను నిలిపివేశారు. ఇదిలా ఉంటే ఉగ్రవాదులు భడేర్వా, థాత్రి, గాండో ప్రాంతాల్లో ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి ఊహా చిత్రాలను కూడా విడుదల చేశారు. ఉగ్రవాదుల ఆచూకీ తెలిపిన వారికి రూ.5 లక్షల రివార్డును కూడా ప్రకటించారు.