బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను కలిసిన సోనియాగాంధీ

Sonia Gandhi meets Sheikh Hasina
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియాగాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ కలిశారు. నిన్న మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బంగ్లాదేశ్ ప్రధాని వచ్చారు. ఇక్కడే ఉన్న షేక్ హసీనాను నెహ్రూ కుటుంబం కాంగ్రెస్ నేతలు కలిశారు. ఇరు కుటుంబాల మధ్య ఉన్న అనుబంధాన్ని వారు గుర్తుచేసుకున్నారు. సోనియా, రాహుల్, ప్రియాంకలు బంగ్లా ప్రధానిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.
Go Back to Shorts
Sonia Gandhi
Rahul Gandhi
Priyanka Gandhi
Bangladesh

More Telugu News