మోదీ 3.0 కేబినెట్లో ఆరుగురు న్యాయవాదులు
- మాస్టర్స్ డిగ్రీలు పూర్తి చేసిన ప్రధాని మోదీ, రాజ్నాథ్ సింగ్
- ఎంబీఏ పూర్తి చేసిన ముగ్గురు మంత్రులు
- పోస్టు గ్రాడ్యుయేషన్ పాసైన 10 మంది మినిస్టర్లు
ఇక రాజ్నాథ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, ఎస్. జైశంకర్, ధర్మేంద్ర ప్రధాన్, డాక్టర్ వీరేంద్ర కుమార్, మన్సుఖ్ మాండవీయ, హర్దీప్ సింగ్ పూరి, అన్నపూర్ణా దేవి, గజేంద్ర సింగ్ షెకావత్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మరోవైపు కేంద్ర కేబినెట్లో చోటు దక్కించుకున్న మనోహర్ లాల్, హెచ్డీ కుమారస్వామిలతో పాటు జితన్ రామ్ మాంఝీ, రాజీవ్ రంజన్ (లలన్ సింగ్), ప్రహ్లాద్ జోషి, గిరిరాజ్ సింగ్లతో సహా ఆరుగురు మంత్రులు పట్టభద్రులుగా ఉన్నారు.