పాకిస్థాన్ లో అదుపుతప్పి లోయలో పడ్డ బస్సు.. 28 మంది మృత్యువాత!
- బలూచిస్థాన్లో బుధవారం తెల్లవారుజామున దుర్ఘటన
- డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమన్న స్థానిక మీడియా
- ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని షెహబాజ్ షరీఫ్
సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హెలికాప్టర్లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మరోవైపు ఈ ఘటనపై ఆ దేశ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.