Chiranjeevi: మమ్మల్ని గర్వపడేలా చేసినందుకు థాంక్యూ చిరంజీవి గారూ!: అల్లు అర్జున్

  • టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్
  • నిన్న ఢిల్లీలో అవార్డు స్వీకరించిన చిరంజీవి
  • ఈ క్షణాలు తమకెంతో గర్వకారణమన్న అల్లు అర్జున్
Allu Arjun post on Chiranjeevi conferred with Padma Vibhushan

మెగాస్టార్ చిరంజీవి నిన్న ఢిల్లీలో పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్న సంగతి తెలిసిందే. ఈ విశిష్ట పురస్కార గ్రహీతల గౌరవార్థం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విందు కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో స్పందించారు. "చిరంజీవి గారూ... ప్రతిష్ఠాత్మక పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నందుకు నా హృదయపూర్వక అభినందనలు. ఈ క్షణాలు మాకెంతో గర్వకారణంగా నిలిచిపోతాయి. మమ్మల్ని గర్వపడేలా చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం" అంటూ అల్లు అర్జున్ పోస్టు చేశారు.

  • Loading...

More Telugu News