మీడియా సంస్థల అధిపతుల ఫోన్లూ వదలని ప్రణీత్రావ్ అండ్ కో!
- ప్రణీత్రావు బృందం ట్యాప్ చేసిన అన్ని ఫోన్ నంబర్లను గుర్తించిన దర్యాప్తు అధికారులు
- మరింత లోతుగా సమాచారం సేకరిస్తున్న అధికారులు
- ఫోన్లు ట్యాప్ అయిన విషయాన్ని ఆయా మీడియా సంస్థల అధిపతుల దృష్టికి తీసుకెళ్లిన దర్యాప్తు బృందం
రాజకీయ ప్రత్యర్థులు, నాయకులు, వ్యాపారులే కాకుండా మీడియా సంస్థల అధిపతుల ఫోన్లు కూడా ట్యాప్ అయిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో దర్యాప్తు అధికారులు మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. ట్యాపింగ్ కేసులో మీరూ బాధితులేనని, మీ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని, దీనికి సంబంధించి మీ వద్ద ఏదైనా అదనపు సమాచారం ఉంటే అందించాలంటూ దర్యాప్తు అధికారులు ఆయా మీడియా సంస్థల అధిపతులకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది.