Mumbai Indians: చెలరేగిన సూర్యకుమార్ యాదవ్... ముంబయి ఇండియన్స్ భారీ స్కోరు

Mumbai Indians set 193 runs target to Punjab Kings
  • ముల్లన్ పూర్ లో ముంబయి ఇండియన్స్ × పంజాబ్ కింగ్స్
  • టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబయి
  • నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 192 పరుగులు 
  • 53 బంతుల్లో 78 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్

ఐపీఎల్ తాజా సీజన్ లో ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే గెలవక తప్పని మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ భారీ స్కోరు సాధించింది. ముల్లన్ పూర్ లో ఇవాళ పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 192 పరుగులు చేసింది. 

'మిస్టర్ 360' సూర్యకుమార్ యాదవ్ మరోసారి తన బ్యాటింగ్ స్పెషాలిటీ ప్రదర్శించాడు. సూర్య 53 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో 78 పరుగులు చేశాడు. తెలుగుతేజం తిలక్ వర్మ 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 34 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రోహిత్ శర్మ 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 36 పరుగులు సాధించాడు. 

పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3, కెప్టెన్ శామ్ కరన్ 2, కగిసో రబాడా 1 వికెట్ తీశారు.

  • Loading...

More Telugu News