మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై కారు బీభత్సం... ఇద్దరి దుర్మరణం
- గత అర్ధరాత్రి దాటాక ఘటన
- కేబుల్ బ్రిడ్జిపై ఫొటోలు దిగుతున్న బావ, బావమరిది
- మృత్యువు రూపంలో వేగంగా దూసుకొచ్చిన కారు
- మృతులను యూసఫ్ గూడకు చెందిన అనిల్, అజయ్ గా గుర్తింపు
మృతులను యూసఫ్ గూడకు చెందిన అనిల్, అజయ్ గా గుర్తించారు. వారు బావ, బావమరిది అని తెలుస్తోంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
కాగా, ప్రమాదానికి కారణమైన కారు... ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టిన ఆనంతరం ఆగకుండా వెళ్లిపోవడంతో, కారు నెంబరు (AP28DV7999) ఆధారంగా వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో సీసీటీవీ ఫుటేజి పరిశీలించాలని పోలీసులు నిర్ణయించారు.