తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాలలో విద్యార్థి బలవన్మరణం!
- ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డ విద్యార్థి దేవపంగు వివేక్
- నాదర్ గుల్లోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో ఘటన
- టీచర్ వేధింపులే కారణమని అనుమానం
ఇది గమనించిన తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. అయితే, ఓ టీచర్ కొట్టడంతో మనస్తాపం చెంది వివేక్ బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.