ఏడాది కిందట 17 వేల కోట్ల ఆస్తి .. ఇప్పుడు సున్నా.. బైజూస్ ఓనర్ దుస్థితి..!
- కిందటేడాది ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్న రవీంద్రన్
- ఎడ్యుకేషన్ స్టార్టప్ బైజూస్ తో వేగంగా పైకెదిగిన వైనం
- ఒడిదుడుకులతో అంతే వేగంగా నేలకు జారిన బైజూస్ అధినేత
- దేశంలోనే అత్యంత విలువైన స్టార్టప్ గా ప్రశంసలు
2022లో ఆయన సంపద ఏకంగా 22 బిలియన్ డాలర్లకు చేరడంతో రవీంద్రన్ పేరును ఫోర్బ్స్ జాబితాలోకి చేర్చింది. అయితే, కంపెనీ అనుసరించిన పలు విధానాలు, సీఈవోగా రవీంద్రన్ తీసుకున్న నిర్ణయాలు బెడిసికొట్టి కంపెనీని నష్టాల్లోకి నెట్టాయి. దీంతో రాకెట్ వేగంతో పైకెదిగిన బైజూస్.. అదే వేగంతో చతికిలపడింది. ఈ ఏడాదికి సంబంధించి ఇటీవల ఫోర్బ్స్ సంపన్నుల జాబితాను విడుదల చేసింది. అందులో బైజూస్ అధినేత రవీంద్రన్ తో పాటు మరో ముగ్గురు చోటు కోల్పోయారని పేర్కొంది. 2022 లో 22 బిలియన్ డాలర్ల నెట్ వర్త్ తో ఉన్న బైజూస్ సీఈవో.. ఈ ఏడాది 1 బిలియన్ కన్నా తక్కువకు పడిపోయిందని ఫోర్బ్స్ తన రిపోర్టులో వెల్లడించింది.