భువనగిరి, నల్గొండలలో కచ్చితంగా గెలుస్తాం: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
- సికింద్రాబాద్ ఎంపీగా దానం నాగేందర్ను గెలిపించడమే తమ బాధ్యత అన్న కోమటిరెడ్డి
- బీఆర్ఎస్ది కుటుంబ పాలన అని విమర్శ
- కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో లేకున్నా ఈసారి గెలిచామన్న కోమటిరెడ్డి
బీఆర్ఎస్ది కుటుంబ పాలన అని విమర్శించారు. కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో లేకున్నా ఈసారి గెలిచామన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా సికింద్రాబాద్ను పట్టించుకోలేదని ఆరోపించారు. ఆయన మతాల మధ్య గొడవలు పెట్టి గెలవాలని చూస్తున్నారన్నారు. కానీ అది అసాధ్యమన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 14 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 40 వేల కోట్లతో మూసీ ప్రాజెక్టును ప్రక్షాళన చేసి అభివృద్ధి చేస్తామన్నారు. కేసీఆర్ కేబుల్ బ్రిడ్జ్ వేసి హైదరాబాద్ అభివృద్ధి అని అంటున్నారని మండిపడ్డారు. హరీశ్ రావు మాటలకు అర్థం లేదన్నారు. కేసీఆర్ చేసిన పాపాల కారణంగానే వర్షాలు కురవడం లేదన్నారు.