సన్రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో బద్దలైన రికార్డులు ఇవే
- ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు -277ను నమోదు చేసిన సన్రైజర్స్
- సెకండ్ ఇన్నింగ్స్లో అత్యధిక స్కోరు 246 రికార్డు నమోదు చేసిన ముంబై ఇండియన్స్
- ఒకే మ్యాచ్లో నమోదయిన 523 పరుగులతో సరికొత్త రికార్డు
- బుధవారం రాత్రి రికార్డుల మ్యాచ్కు వేదికైన ఉప్పల్ క్రికెట్ స్టేడియం
సన్రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్లో బద్దలైన రికార్డులివే..
- ఒక మ్యాచ్లో రెండు జట్ల మొత్తం స్కోరు 500 దాటడం ఇదే తొలిసారి. మొత్తం 523 పరుగుల నమోదు.
- 2023లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్ల మొత్తం స్కోరు 517 పరుగులు ఇప్పుడు రెండవ స్థానానికి పడిపోయింది
- పురుషుల టీ20 లీగ్లు, ఐపీఎల్ టోర్నీలో ఇదే (523) అత్యధిక స్కోరు
- ఐపీఎల్లో 2010 సీజన్లో చెన్నై, రాజస్థాన్ జట్లు మొత్తం 469 పరుగులు ఇప్పటివరకు టాప్ స్కోరుగా ఉండేది. అది ఇప్పుడు బ్రేక్ అయ్యింది.
- ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు -277 నమోదు చేసిన సన్రైజర్స్ హైదరాబాద్
- సెకండ్ ఇన్నింగ్స్లోనూ అత్యధిక పరుగులుగా నిలిచిన ముంబై ఇండియన్స్ - 246 స్కోరు
- ఈ మ్యాచ్లో మొత్తం మొత్తం సిక్స్లు, ఫోర్ల సంఖ్య 69
- 2010లో చెన్నై, రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో 69 బౌండరీలు నమోదయాయి.
- ఒక ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక సిక్సర్లు - 38 నమోదు
- పురుషుల టీ20 టోర్నీలో అత్యధిక సిక్సర్లు నమోదయిన మ్యాచ్ ఇదే
- సన్రైజర్స్పై మ్యాచ్లో ముంబై బ్యాటర్లు కొట్టిన సిక్సర్ల సంఖ్య 20గా ఉంది. అంతకంటే ముందు 2013లో రాయల్ ఛాలంజర్స్ బెంగళూరు జట్టు ఒకే ఇన్నింగ్స్లో ఏకంగా 21 సిక్సర్లు బాదింది.