లోకేశ్ ను ఓడించడానికి రూ. 500 కోట్లు దాచారు: బుద్దా వెంకన్న
- మంగళగిరిలో ఒక్కో ఓటుకు రూ. 30 వేలైనా పంచేందుకు సిద్ధమయ్యారన్న వెంకన్న
- సాక్షి వాహనాల్లో రాష్ట్రమంతటా డబ్బు పంపిణీ చేస్తున్నారని ఆరోపణ
- డీజీపీని తప్పించాలని ఈసీకి లేఖ రాస్తామన్న వెంకన్న
ఎన్నికల కోడ్ వచ్చినా పోలీసు శాఖ భయం లేకుండా వైసీపీకి సపోర్ట్ చేస్తోందని బుద్దా మండిపడ్డారు. డీజీపీని తప్పించాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామని చెప్పారు. ఒంటిమిట్ట సుబ్బారావు కుటుంబానికి జరిగిన అన్యాయం వెనకున్న వారిపై 24 గంటల్లో పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.