భారత్తో సయోధ్యకు వచ్చిన మాల్దీవులు.. అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు కీలక వ్యాఖ్యలు
- రుణ విముక్తిలో భారత్ సాయం కోరిన మాల్దీవులు
- భారత్ సన్నిహిత భాగస్వామ్య దేశమన్న అధ్యక్షుడు ముయిజ్జు
- ఇండియా మైత్రి విషయంలో సందేహం లేదని వ్యాఖ్య
- అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ఇచ్చిన తొలి ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు
భారీ రుణాల చెల్లింపులో మాల్దీవులకు ఉపశమన చర్యలు కల్పించాలని భారత్ను కోరారు. వారసత్వంగా కొనసాగుతున్న విధానంలో భారత్ నుంచి ఇప్పటికే పెద్ద సంఖ్యలో రుణాలు పొందామని, ఈ రుణాల చెల్లింపులో మినహాయింపుల కోసం ప్రయత్నిస్తున్నామని, ఈ మేరకు సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. ఇప్పటికే దేశంలో కొనసాగుతున్న ప్రాజెక్ట్లను నిలిపివేయడానికి ఎటువంటి ప్రతికూల పరిస్థితులు లేవని అన్నారు. మాల్దీవులు-భారత్ సంబంధాలను నిలిపివేయడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదని అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు పేర్కొన్నారు.
కాగా గతేడాది చివరి నాటికి మాల్దీవులు భారత్కు సుమారు 400.9 మిలియన్ డాలర్ల రుణం చెల్లించాల్సి ఉంది. ఇక 2023 నవంబర్లో దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి మహ్మద్ ముయిజ్జు భారత వ్యతిరేక వైఖరిని కొనసాగిస్తున్నారు. చైనా అనుకూల ధోరణిని ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే.