మహారాష్ట్రలో 10 నిమిషాల వ్యవధిలో రెండుసార్లు కంపించిన భూమి.. భయంతో పరుగులు తీసిన జనం!
- మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో భూకంపం
- హింగోలితో పాటు పర్భానీ, నాందేడ్లో భూప్రకంపనలు
- రిక్టర్ స్కేల్పై తీవ్రత వరుసగా 4.5, 3.6గా గుర్తింపు
- భూకంప కేంద్రం అఖారా బాలాపూర్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించిన నాందేడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ
ఈ భూకంప కేంద్రం అఖారా బాలాపూర్ ప్రాంతంలో ఉన్నట్లు నాందేడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ గుర్తించింది. నాందేడ్ జిల్లా పరిధిలోని అర్ధాపూర్, ముద్ఖేడ్, నాయిగామ్, దెగ్లూర్, బిలోలి ప్రాంతాలలో కూడా స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. కాగా, ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.