ఎలక్టోరల్ బాండ్లపై ఎస్బీఐకి కీలక ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు
- వివరాలన్నీ తప్పనిసరిగా వెల్లడించాల్సిందేనన్న రాజ్యాంగ ధర్మాసనం
- క్రమసంఖ్యతో సహా చెప్పాల్సిందేనంటూ ఆదేశాలు
- గురువారం సాయంత్రం 5 గంటల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలన్న సుప్రీం
- బ్యాంకు నుంచి వివరాలు అందినవెంటనే వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఈసీకి ఆదేశం
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అందజేసే విరాళాలపై ఎస్బీఐ అందించిన అసంపూర్ణ డేటాపై దాఖలైన పిటిషన్పై నేడు విచారణ జరగ్గా అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీచేసింది. బ్యాంకు అధీనంలో ఉన్న ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని బహిర్గతం చేయాలని తాము కోర్టుకుంటున్నట్టు జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. అంతేకాదు, తాము ఎలాంటి వివరాలను దాచిపెట్టలేదని స్పష్టం చేస్తూ గురువారం సాయంత్రం 5 గంటలలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్బీఐ చైర్మన్ను ఆదేశించింది. బ్యాంకు నుంచి ఆ వివరాలు అందిన వెంటనే వాటిని వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.