వైఎస్సార్సీపీ అభ్యర్థుల జాబితాలో 34 మంది ఇంజనీర్లు
- 17 మంది వైద్యులు ఉన్నట్టు వెల్లడించిన అధికార పార్టీ
- 175 మంది అసెంబ్లీ అభ్యర్థుల్లో 131 మంది విద్యావంతులేనని వెల్లడి
- ఎక్స్ వేదికగా వివరాలు వెల్లడించిన వైసీపీ
అభ్యర్థుల్లో అత్యధికంగా 34 మంది ఇంజనీర్లు ఉన్నారని వైసీపీ తెలిపింది. 17 మంది వైద్యులు, 15 మంది న్యాయవాదులు, ఐదుగురు టీచర్లు, ఇద్దరు సివిల్ సర్వెంట్లు, ఒకరు రక్షణ శాఖ మాజీ ఉద్యోగి, ఒకరు జర్నలిస్ట్ ఉన్నారని ఆ పార్టీ వివరించింది.