కూతురు క్లీంకారతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన ఉపాసన
- హైదరాబాద్ లో గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవ్ కార్యక్రమం
- కూతురుతో కలిసి కార్యక్రమానికి హాజరైన ఉపాసన
- క్లీంకార ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డ వైనం
తాజాగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉపాసన కలిశారు. తన కూతురు క్లీంకారతో కలిసి రాష్ట్రపతిని కలిశారు. హైదరాబాద్ లో జరిగిన గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవ్ కార్యక్రమానికి ఉపాసన హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో కూడా క్లీంకార ముఖం కనిపించకుండా ఉపాసన జాగ్రత్త పడ్డారు.
ఈ సందర్భంగా ఉపాసన ఎక్స్ వేదికగా స్పందిస్తూ... భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును తన కుమార్తె క్లీంకారతో కలిసి కలవడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ అవకాశాన్ని కల్పించినందుకు, ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు కామ్లేశ్ దాజీకి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.