కవితను విమానాశ్రయానికి తరలించిన ఈడీ.. రేపు ఢిల్లీలో ఈడీ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం.. వీడియో ఇదిగో
- సాయంత్రం 5.20 గంటల సమయంలో కవితను అరెస్ట్ చేసినట్టు ఈడీ ప్రకటన
- మనీ లాండరింగ్ యాక్ట్ కింద అరెస్ట్ చేసినట్టు వెల్లడి
- రాత్రి 8.45 గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ ఫ్లైట్
రేపు మధ్యాహ్నం ఆమెను ఈడీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు తన నివాసం నుంచి బయటకు వచ్చిన కవిత అక్కడున్న బీఆర్ఎస్ శ్రేణులకు అభివాదం చేశారు. కవితను తరలిస్తున్న సమయంలో కవిత భర్త, పిల్లలతో పాటు కేటీఆర్, హరీశ్ రావు అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర భావోద్వేగ పరిస్థితులు నెలకొన్నాయి. కవితను తరలించిన వాహనంలో ఒక మహిళా అధికారితో పాటు మరి కొందరు అధికారులు ఉన్నారు. భారీ భద్రత మధ్య కవితను ఎయిర్ పోర్టుకు తరలిస్తున్నారు.