హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని చితకబాదిన యువకులు

Unknown youth attacked IT employee in Hyderabad
  • అనురాగ్ యూనివర్శిటీ వద్ద ఘటన
  • టీసీఎస్ లో పని చేస్తున్న బాధితుడు కుర్వ నవీన్ కుమార్
  • వెంబడించి చితకబాదిన గుర్తు తెలియని యువకులు
ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిపై గుర్తు తెలియని యువకులు దాడి చేసిన ఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అనురాగ్ విశ్వవిద్యాలయం సమీపంలో కారులో వెళ్తున్న కుర్వ నవీన్ కుమార్ పై 8 మంది యువకులు దాడికి పాల్పడ్డారు. కొర్రెముల చౌరస్తా వరకు ఆయనను వెంబడించి చితకబాదారు. కారుపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు పగిలిపోయాయి. దాడి తర్వాత కారును వారు తీసుకెళ్లారు. నరపల్లి నందనవనం వద్ద కారును వదిలిపెట్టి పారిపోయారు. బాధితుడు టీసీఎస్ లో పని చేస్తున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 

Go Back to Shorts
IT Employee
Hyderabad
Attack

More Telugu News