పసుపు రైతుల పంట పండింది.. పుష్కరకాలం తర్వాత భారీ ధర
- క్వింటాలుకు ఏకంగా రూ. 18,299 పలికిన ధర
- వారం క్రితంతో పోలిస్తే రూ. 3 వేలకు పైగా అధికం
- 12 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
- సాగు తగ్గడంతో డిమాండ్
జిల్లాలోని పెర్కిట్కు చెందిన రైతు తీగల గంగారెడ్డి తీసుకొచ్చిన పసుపుకు ఈ ధర పలికింది. పసుపుకు ఇంత భారీ ధర రావడం 12 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారని రైతులు చెబుతున్నారు. గత ఆరేళ్లుగా ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో పసుపు రైతులు ఈసారి సాగు తగ్గించారు. ఫలితంగా డిమాండ్ పెరిగి రోజురోజుకు ధరలు పెరుగుతున్నాయి.