టాలీవుడ్ నటికి హైకోర్టులో ఊరట
- ఇటీవల కారును రాంగ్ రూట్లో నడిపిన నటి సౌమ్య జాను
- అడ్డుకున్న హోంగార్డ్ పై దురుసు ప్రవర్తన
- కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు
- తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన నటి
అయితే, పోలీసులు తనపై తదుపరి చర్యలు తీసుకోకుండా నిలువరించాలని కోరుతూ సౌమ్య జాను తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఆమె పిటిషన్ పై ఇవాళ విచారించిన ధర్మాసనం... చట్టప్రకారం 41ఏ కింద నోటీసులు ఇచ్చాకే అదుపులోకి తీసుకోవాలని, అప్పటివరకు ఆమెపై చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. అంతేకాదు, దర్యాప్తు అధికారికి విచారణలో సహకరించాలని నటి సౌమ్య జానుకు స్పష్టం చేసింది.
కాగా, పోలీసులు నమోదు చేసిన సెక్షన్ల ప్రకారం, నేర నిరూపణ అయితే నటి సౌమ్య జానుకు గరిష్ఠంగా ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.