టీడీపీని నాశనం చేసేది చంద్రబాబు పనులే..: విజయసాయి రెడ్డి
- ముఖ్యమంత్రి పదవి కోసం దిగజారుతున్నారని విమర్శ
- పార్టీ ఐడియాలజీని కాలరాసి కార్యకర్తలను మోసం చేస్తున్నారని ఫైర్
- నాలుగేళ్ల క్రితం మాట్లాడిన మాటలను గాలికి వదిలేశారని ఆరోపణ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టడంపైనా విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. ఎన్నికలు పూర్తయి వైసీపీ గెలిచాక రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉనికిలో లేకుండా పోతుందని జోస్యం చెప్పారు. కూటమి ఉండేది నాలుగు రోజులే అయినా సరే దీనికి కొన్ని పేర్లు సూచిస్తానని అంటూ మరో ట్వీట్ చేశారు. ఇందులో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ‘ట్రిపుల్ యూ టర్న్, ది డిస్కార్డ్ కన్సార్టియం, ట్రిపుల్ డైలమా అలయెన్స్, టగ్ ఆఫ్ వార్ ట్రయంవేర్, త్రీ స్టెప్స్ బ్యాక్ వర్డ్’ అంటూ విజయసాయి రెడ్డి పేర్లు సూచించారు.