ఐఎస్పీఎల్లో ముంబై చేతిలో ఓడిన మెగా హీరో రాంచరణ్ జట్టు
- ఐఎస్పీఎల్లో ఫాల్కన్స్ రైజర్స్ హైదరాబాద్ జట్టును కొనుగోలు చేసిన రాంచరణ్
- నిన్న థానేలో మాఝీ ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో ఓటమి
- మరింత బలంగా వస్తామంటూ రాంచరణ్ ట్వీట్
- గెలిచిన ముంబై జట్టుకు అభినందనలు
ఐఎస్పీఎల్లో హైదరాబాద్ జట్టును రాంచరణ్ ఇటీవల కొనుగోలు చేశాడు. ముంబై జట్టుకు అమితాబ్ బచ్చన్, శ్రీనగర్ జట్టుకు అక్షయ్ కుమార్, బెంగళూరు జట్టుకు హృతిక్ రోషన్ యజమానులుగా ఉన్నారు. ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ లీగ్ ఏర్పాటైంది. ఇది టీ10 ఫార్మాట్లో జరిగే టెన్నిస్ క్రికెట్ ఇది. ఈ లీగ్ ద్వారా వెలుగుచూసే ప్రతిభావంతులైన ఆటగాళ్లను గుర్తించి వారిని సూపర్స్టార్లుగా తీర్చిదిద్దుతారు.