అభ్యర్థుల ఎంపికపై చర్చ... కిషన్ రెడ్డికి అధిష్ఠానం నుంచి పిలుపు
- ఇప్పటికే తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
- మిగతా 8 స్థానాల్లో ఎంపికపై కిషన్ రెడ్డితో చర్చించే అవకాశం
- రేపు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థుల ఖరారు
17 లోక్ సభ స్థానాలకు గాను మరో ఎనిమిది చోట్ల అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు అధిష్ఠానం కిషన్ రెడ్డిని ఢిల్లీకి రావాలని పిలిచింది. దీంతో ఈ రోజు ఆయన ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఇదే సమయంలో పార్టీలో చేరికలపై కూడా చర్చించనున్నారు. రేపు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. మిగతా అభ్యర్థులను ఖరారు చేసే అవకాశముంది.