అభ్యర్థుల ఎంపికపై చర్చ... కిషన్ రెడ్డికి అధిష్ఠానం నుంచి పిలుపు

Kishan Reddy will go New Delhi today
  • ఇప్పటికే తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
  • మిగతా 8 స్థానాల్లో ఎంపికపై కిషన్ రెడ్డితో చర్చించే అవకాశం
  • రేపు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థుల ఖరారు
కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ కొన్ని రోజుల్లో రానుంది. ఈ క్రమంలో అన్ని పార్టీలు అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నాయి. బీజేపీ ఇప్పటికే 195 లోక్ సభ అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థులను ప్రకటించింది.

17 లోక్ సభ స్థానాలకు గాను మరో ఎనిమిది చోట్ల అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు అధిష్ఠానం కిషన్ రెడ్డిని ఢిల్లీకి రావాలని పిలిచింది. దీంతో ఈ రోజు ఆయన ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఇదే సమయంలో పార్టీలో చేరికలపై కూడా చర్చించనున్నారు. రేపు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. మిగతా అభ్యర్థులను ఖరారు చేసే అవకాశముంది.
Go Back to Shorts
G. Kishan Reddy
BJP
Telangana

More Telugu News