ప్రధాని మోదీని పెద్దన్న అని ఎందుకు అన్నారో... రేవంత్ రెడ్డినే అడగండి: కిషన్ రెడ్డి వ్యాఖ్య
- పెద్దన్న అన్నంత మాత్రాన వారిద్దరు కలిసినట్లుగా భావించాలా? అని ప్రశ్న
- విపక్షాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, అది ప్రభుత్వాలకు సంబంధించిన అంశమని వెల్లడి
- తెలంగాణలో మోదీ సభలు విజయవంతమయ్యాయన్న కిషన్ రెడ్డి
తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ సభలు విజయవంతమయ్యాయన్నారు. రేపటి నుంచి బీజేపీ మేనిఫెస్టో కోసం సలహాలను, సూచనలను స్వీకరిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల అమలుపై స్పష్టత లేకుండా పోయిందని ఆరోపించారు. సగటు ప్రజల ఓట్లను కూడా తాము మోదీకి అనుకూలంగా కూడగట్టే విధంగా ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు.