గూగుల్ ప్లేస్టోర్ నుంచి భారత మ్యాట్రిమోనీ యాప్లు తొలగింపు
- ‘సర్వీస్ ఫీజు చెల్లింపు వివాదం’ నేపథ్యంలో నిర్ణయం
- యాప్లపై 15-30 శాతం ఫీజులు విధించవొద్దని అధికారులు ఆదేశాలివ్వడంతో గూగుల్ చర్యలు
- కోర్ట్ ఆదేశాలు అనుకూలంగా ఉండడంతో యాప్ల తొలగింపు
మ్యాట్రిమోనీ స్టార్టప్లకు ఉపశమనం అవసరం లేదంటూ జనవరి, ఫిబ్రవరి నెలల్లో కోర్టులు పేర్కొన్నాయి. ఈ మేరకు దాఖలైన పిటిషన్లపై విచారణ అనంతరం ఆదేశాలు జారీ చేశాయి. ఫీజు వసూలు చేయవచ్చు లేదా యాప్లను తొలగించవచ్చని పేర్కొన్నాయి. దీంతో యాప్స్ తొలగింపునకు గూగుల్ ముందడుగు వేసింది. భారత్ మ్యాట్రిమోనీ, క్రీస్టియన్ మ్యాట్రిమోనీ, ముస్లిం మ్యాట్రీమోనీ, జోడీ యాప్లను గూగుల్ శుక్రవారం తొలగించిన విషయం తెలిసిందే.