Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఏపీ కాంగ్రెస్ నేత రఘువీరా రెడ్డి

  • రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన రఘువీరారెడ్డి
  • హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో కలిసిన ఏపీ కాంగ్రెస్ నేత
  • ప్రస్తుతం సీడబ్ల్యుసీ సభ్యుడిగా ఉన్న రఘువీరా రెడ్డి
Raghuveera Reddy meets CM Revanth Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు, సీడబ్ల్యుసీ సభ్యుడు రఘువీరా రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో ఆయన కలిశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏపీకి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఆయనను వరుసగా కలుస్తున్నారు. రఘువీరా రెడ్డి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్లో మంత్రిగా కూడా పని చేశారు.

More Telugu News