అది తప్పని నిరూపిస్తే రూ.1 లక్ష బహుమానం అని మా నేత ప్రకటించారు: పురందేశ్వరి
- మంగళగిరి ఎయిమ్స్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ
- ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన యువ మోర్చా నేత
- సదరు నేతపై సీఐ దాడి చేశాడన్న పురందేశ్వరి
రాజకీయాలతో పని లేకుండా ఏపీకి కేంద్రం సహకారం అందిస్తోందని తెలిపారు. అందులో భాగంగానే ఎయిమ్స్ కు నిధులు అందించిందని, ఈ విషయం తప్పని నిరూపిస్తే రూ.1 లక్ష బహుమానం ఇస్తామని తమ నేత ప్రకటించారని పురందేశ్వరి వివరించారు. అందులో అభ్యంతరం వ్యక్తం చేయాల్సింది ఏముందని ప్రశ్నించారు. సదరు సీఐపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు.